తెలంగాణ రాష్ట్ర సంక్షేమానికి కేంద్రం పెద్దపీట..

by Vinod kumar |
తెలంగాణ రాష్ట్ర సంక్షేమానికి కేంద్రం పెద్దపీట..
X

దిశ, దంతాలపల్లి: తెలంగాణ రాష్ట్ర సంక్షేమానికి కేంద్రం పెద్దపీట వేసిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దగాని సోమయ్య అన్నారు. మండల కేంద్రంలోని నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు కేంద్రం సుమారు ఒక లక్ష 35 వేల కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు. రైతులకు కిసాన్ సన్మాన్ నిధి యోజన లో భాగంగా పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి కోసం రూ. 983 కోట్ల కోసం కేటాయించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్, నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ తాడ పూర్ణచందర్ రెడ్డి, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానోత్ ప్రభాస్ నాయక్, మండల ఉపాధ్యక్షులు అల్లం సాయికుమార్, మండల ప్రధాన కార్యదర్శిలు దాసరి మురళి, దిలీప్ రెడ్డి, లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed