- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే రోటరీ లక్ష్యం : వడ్లమాని జవహర్
![అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే రోటరీ లక్ష్యం : వడ్లమాని జవహర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే రోటరీ లక్ష్యం : వడ్లమాని జవహర్](https://www.dishadaily.com/h-upload/2024/07/04/348891-22.webp)
దిశ, హన్మకొండ : అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే రోటరీ లక్ష్యం అని ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ వడ్లమాని జవహర్ అన్నారు. హన్మకొండ లోని అసంత భవన్ లో రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షుడు అన్నం రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన రోటరీ క్లబ్ ఆఫ్ హన్మకొండ 25వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా చాలా మిరాకిల్స్ ని సృష్టిస్తు వస్తుంది అని, అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేస్తుంది అని, అందుకే ఈ ఇయర్ రోటరీ థీమ్ మ్యాజిక్ ఆఫ్ రోటరీ గా గుర్తింపు పొందిందన్నారు. రోటరీ సభ్యులుగా ఉండి సమాజానికి సేవ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
గత సంవత్సరం చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారని అందుకుగాను పూర్వ అధ్యక్షుడు అన్నం రవీంద్రనాథ్ కార్యదర్శి శిరీష్ కుమార్ కు, కోశాధికారి నరేష్ ల తో పాటు కార్యవర్గ సభ్యులను సన్మానించారు. అనంతరం నూతన కార్యవర్గం అధ్యక్షులుగా శారు ప్రభాకర్ రెడ్డి కార్యదర్శిగా ,కె ప్రవీణ్ కుమార్, కోశాధికారిగా అంచురి విజయ్ కుమార్ ,ప్రమాణ స్వీకారం చేయంచి సభ్యులను వేదికకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లు కొంపల్లి ప్రభాకర్ ,డాక్టర్ శరత్ బాబు,అసిస్టెంట్ గవర్నర్ గార్లపాటి శ్రీనివాస్,డిప్యూటీ గవర్నర్ నరసింహ యాదవ్ ,రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ సభ్యులు మరి వారి కుటుంబ సభ్యులు, సహచర క్లబ్ ల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.