చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతరం పహారా ఉండాలి : సీపీ

by Disha Web Desk 23 |
చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతరం  పహారా ఉండాలి : సీపీ
X

దిశ,జనగామ : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన జనగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మిక తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా సీపీ చెక్ పోస్ట్ అధికారులు పోలీసు భద్రత సిబ్బందితో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చెక్ పోస్టులు కీలకపాత్ర వ్యవహరిస్తాయని అన్నారు. జిల్లాలోని చెక్ పోస్టులలో సిబ్బంది పహారాతో పకడ్బందీగా 24x7 విధులు నిర్వహించాలని, ముఖ్యంగా అక్రమ మార్గంలో ఎటువంటి మద్యం, డబ్బు, ప్రజలను ప్రలోభ పెట్టే వస్తువులను జిల్లాకు రాకుండా వివిధ శాఖల సమన్వయంతో 24 గంటల పర్యవేక్షణలో చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టాలని సీపీ సూచించారు. అనంతరం వాహన తనిఖీలు చేసిన వాహన నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడం తో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

Next Story