చామల కిరణ్ కుమార్ గెలుపు కొరకు కృషి చేయాలి: కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

by Disha Web Desk 23 |
చామల కిరణ్ కుమార్ గెలుపు కొరకు కృషి చేయాలి: కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
X

దిశ,జనగామ: జనగామ డీసీసీ కార్యాలయంలోనీ ప్రెస్ మీట్ లో డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ పార్టీ వల్ల రాష్ట్రానికి నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు అని, అంబానీ అదానీ కి న్యాయం చేయడానికి మోడీ పని చేస్తున్నాడు అని, విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు అని అన్నారు.⁠2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, వారు చేసిన పనులు నిత్యావసర వస్తువుల ధరలు 3 రేట్లు పెరిగాయి అని,బీజేపీ ఈ 10 ఏండ్లలో తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసింది అని,బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏండ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారు అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ, వారి అభివృద్ధికి పాటు పడే పార్టీ అని,⁠రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెప్పిన 6 గ్యారంటీలలో మహిళలకు ఫ్రీ బస్, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ, రూ. 500 లకే వంట గ్యాస్, ఆరోగ్య శ్రీ రూ. 5 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు అని,అలాగే ఆగస్టు 15 లోపు రూ. 2లక్ష రుణ మాఫీ కూడా చేస్తున్నాము అని తెలిపారు. ⁠కాంగ్రెస్ పార్టీ 5 న్యాయాలతో ముందుకు వస్తుంది.13న జరిగే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక మెజారిటీ తో గెలుస్తున్నారు అని అన్నారు. ⁠ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి జయప్రకాశ్, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ దేవయ్య గౌడ్, పీసీసీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇందిరా కృష్ణ, బచ్చన్న పేట మండల అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి ఇతర జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed