- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Victims: హరీశన్నా.. మాజీ మంత్రి కారుకు అడ్డువచ్చిన బాధితులు.. తర్వాత ఏమైంది?

దిశ, డైనమిక్ బ్యూరో: హరీశన్నా.. మా ఇండ్లు, దుకాణాలు కూలగొడుతున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ కారుకు అడ్డు వచ్చిన బాధితులకు మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) బాసటగా నిలిచారు. సోమవారం గండిపేట మండలం కాళీ మందిర్ వద్ద షాపులను కూలగొడుతున్న మున్సిపల్ అధికారులపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇండ్లు, దుకాణాలు అకస్మాత్తుగా కూలగొడితే ఎట్లా బతుకుతారు అంటూ ఈ సందర్భంగా హరీశ్ రావు మండిపడ్డారు.
బాధితులకు ధైర్యం చెప్పి, అక్కడి నుంచే బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్తో హరీశ్రావు ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే హైడ్రా (Hydra) పేరిట పేదల బతుకులు కూల్చారు.. ఇప్పుడు దుకాణాలు కూల్చితే బతుకు దెరువు ఎట్లా అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. 20, 30 ఏళ్ల నుంచి ఇక్కడి దుకాణాల పైనే ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధి పై దెబ్బకొట్టడం దుర్మార్గం అని హరీష్ రావు మండిపడ్డారు.
హరీశ్రావు ఫోన్ చేసిన నేపథ్యంలో హుటాహుటిన ఘటన వద్దకు కమిషనర్ చేరుకున్నారు. దీంతో కూల్చివేతలు నిలిపి వేసి అక్కడి నుంచి మున్సిపల్ సిబ్బంది వెళ్లిపోయారు. తమ పక్షాన నిలిచిన హరీష్ రావుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.