నేడు రాష్ట్రానికి నడ్డా, మూడు రాష్ట్రాల సీఎంలు

by Disha Web Desk 4 |
నేడు రాష్ట్రానికి నడ్డా, మూడు రాష్ట్రాల సీఎంలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాషాయ పార్టీ స్పీడ్ పెంచింది. తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా నేడు రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముగ్గురు సీఎంలు రానున్నారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గుజరాత్ సీఎం భుపేంద్ర భాయ్ పాటిల్ నేడు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు పెద్దపల్లిలో జేపీ నడ్డా బహిరంగసభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు చౌటుప్పల్ సభలో నడ్డా పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ సభలో నడ్డా పాల్గొంటారు. ముషీరాబాద్ మీటింగ్‌లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నర్సంపేట సభలో ధామి పాల్గొంటారు. సాయంత్రం సికింద్రాబాద్ సమ్మేళనంలో గుజరాత్ సీఎం భూపేంద్రభాయి పటేల్ పాల్గొంటారు.

Next Story

Most Viewed