సీఎల్పీ సమావేశానికి హాజరైన ఆ ఎమ్మెల్యేలు

by M.Rajitha |
సీఎల్పీ సమావేశానికి హాజరైన ఆ ఎమ్మెల్యేలు
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష(CLP) సమావేశం నేడు హైదరాబాద్(Hyderabad) లో జరిగింది. మాదాపూర్లోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధ్యక్షత వహించారు. ముందుగా పీసీసీ(PCC) చీఫ్ గా నియమించబడిన మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానించారు. రాష్ట్రంలో రానున్న స్థానిక ఎన్నికలు, బీసీ కులగణన, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి తదితర అంశాలు చర్చిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ సమావేశంలో ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. సాధారణంగా సీఎల్పీ సమావేశం అంటే నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించినపుడు నిర్వహిస్తారు. దీనికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. కానీ నేటి సమావేశంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, కడియం శ్రీహరి హాజరయ్యారు. వీరి రాక గురించి కాంగ్రెస్ నేతలు, మీడియా ప్రతినిధులు పలు రకాలుగా చర్చించుకోవడం కనిపించింది.

Next Story