తెలంగాణలో క్రీడాకారులకు సౌకర్యాలు లేవు.. ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా

by Rajesh |
తెలంగాణలో క్రీడాకారులకు సౌకర్యాలు లేవు.. ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో క్రీడాకారులకు ఎలాంటి సౌక్యారాలు లేవని, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త విమర్శలు చేశారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఆయన బుధవారం మాట్లాడారు. నిఖత్ జరీన్ నిజామాబాద్ బిడ్డ అని, ఆమె ఎటువంటి సౌకర్యాలు లేకున్నా ఒలంపిక్స్ లో మెడల్ సాధించిందని గుర్తుచేశారు. నిజామాబాద్ లో ఉన్న రాజారాం గ్రౌండ్ ను క్రికెట్ స్టేడియంగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో ఇండోర్ స్టేడియం నిర్మించాలని ఆయన పట్టుపట్టారు.

Advertisement

Next Story

Most Viewed