జిట్ట అంత్యక్రియలపై భువనగిరిలో తీవ్ర ఉద్రిక్తత

by Bhoopathi Nagaiah |
జిట్ట అంత్యక్రియలపై భువనగిరిలో తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి (Jitta Balakrishna Reddy) అంత్యక్రియలను అధికారికంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన అభిమానులు పట్టణంలో నిరసన చేపట్టారు. భువనగిరికి చేరుకున్న ఆయన మృతదేహానికి భువనగిరి చెరువు కట్ట వద్ద నుంచి ఆయన అభిమానులు, వివిధ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడికి వచ్చిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేష్, సీనియర్ నాయకుడు తంగేళ్లపల్లి రవికుమార్ లను జిట్ట అభిమానులు అడ్డుకొని నిరసన తెలిపారు. అనంతరం కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిట్టా మృతదేహానికి నివాళులు అర్పించారు.

Advertisement

Next Story

Most Viewed