తెలంగాణకు పొంచి ఉన్న వాయుగుండం ముప్పు

by Mahesh |
తెలంగాణకు పొంచి ఉన్న వాయుగుండం ముప్పు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం ఉదయం తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, చెరువులు, వాగులు, వంకలు నిండుకుండల్లా మారిపోయి ఎటు చూసిన వరదలు ప్రవహిస్తున్నాయి. కాగా వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి 12.30 నుంచి 2.30 నిమిషాల మధ్య కళింగపట్నం వద్ద తీరం దాటింది. అయినప్పటికి వాయుగుండం కారణంగా ఏర్పడిన భారీ మేఘాలు తెలంగాణ రాష్ట్రంపై విస్తారంగా కమ్ముకొని..చురుగ్గా కదులుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఇప్పటికే వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed