అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత.. అధికారులపై దాడి

by Disha Web Desk 16 |
అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత.. అధికారులపై దాడి
X

దిశ, ఆసిఫాబాద్: కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం తుంగెడ గ్రామంలో కొందరు అక్రమంగా పోడు చేస్తున్నారు. దీంతో వారిని అడ్డుకోవడానికి అటవీ వెళ్లారు. అయితే అధికారులపై పొడు దారులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా స్థానికులతో పాటు గ్రామస్థులు ఏకమై అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొందరు గొడ్డళ్లు. కర్రలు, రాళ్ళతో అధికారులపై దాడికి యత్నించారు. దీంతో అధికారులు తప్పించుకున్నారు.


ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కొత్త పోడు చేయొద్దని అటవీశాఖ అధికారులు తెలిపారు. కలెక్టర్, తహసీల్దార్‌తో మాట్లాడి తర్వాత పోడు చేయొచ్చని వారం రోజుల క్రితమే పోడు దారులకు చెప్పారు. అయినా పోడు చేస్తున్నారు. దీంతో అడ్డుకునేందుకు తాము వెళ్లామని, పోడుదారులు తమపై దాడికి దిగారని అటవీశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎఫ్ఆర్వో అప్పల కొండ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మరోవైపు రైతు మాత్రం 30 ఏళ్ళుగా ఈ భూములను తాము సాగు చేస్తున్నామని, భూమికి సంబంధించిన పట్టాలు కూడా ఉన్నాయని, ఫారెస్ట్ అధికారులే తమపై దౌర్జన్యంగా దాడికి పాల్పడ్డారని, జిల్లా స్థాయి అధికారులు విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని పోడుదారులు కోరారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed