ఆయిల్ పామ్ సాగులో తెలంగాణను నెం.1 గా నిలబెడతాం : మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

by M.Rajitha |
ఆయిల్ పామ్ సాగులో తెలంగాణను నెం.1 గా నిలబెడతాం : మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పర్యటనకు యూపీ వ్యవసాయశాఖ మంత్రి సూర్యప్రతాప్ షాహి, సహాయమంత్రి బల్దేవ్ సింగ్ వచ్చారు. బుధవారం ఐటీసీ కోహినూరులో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వారితో భేటీ అయ్యారు. దేశంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై ఇరురాష్ట్రాల మంత్రులు చర్చించారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై తుమ్మల వివరించారు. రైతుల కోసం రాష్ట్ర బడ్జెట్ లో సింహాభాగం కేటాయించామని, అలాగే రైతు రుణమాఫీ కోసం 31,000 కోట్లు కేటాయించిన రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. ప్రైవేట్ మరియు పబ్లిక్ రంగంలో విత్తనోత్పత్తి సంస్థలను ప్రోత్సహిస్తున్నామని, తద్వారా రైతుల నికర ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయిల్ పామ్ ను ప్రోత్సహిస్తున్నామని, త్వరలో ఆయిల్ పామ్ ను ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో తెలంగాణ ను దేశంలోనే మొదటిస్థానంలో నిలబెడుతామని తుమ్మల వెల్లడించారు. యూపీ మంత్రులు మాట్లాడుతూ యూపీలో 9 వ్యవసాయ జోన్లు ఉన్నాయని, చెరకు పంటలో యాంత్రీకరణ, చక్కెర కర్మాగారాలను భారీ ఎత్తున ఆధునీకరించడం ద్వారా రైతుల నికర ఆదాయాన్ని పెంచామన్నారు. చెరకు పంట సాగులో తమ ప్రభుత్వానికి నీటి నిర్వహణ ఖర్చు ఎక్కువ కావటం మరియు విద్యుత్ ను అధిక మొత్తంలో వినియోగించటంపై పంటమార్పిడి దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఉత్తర ప్రదేశ్ లో రైతులు వాడే వరి విత్తనాలు ఎక్కువగా తెలంగాణ నుంచే వస్తాయని తెలిపారు. పర్యటనలో భాగంగా విత్తనకంపెనీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. మంత్రి తుమ్మలను యూపీకి రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందర్, కమిషనర్ గోపి, ఉత్తరప్రదేశ్ సీఎం సలహాదారు అవనీష్ కే అవస్తి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవీందర్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed