Electricity Bill : మా మూడు తరాలు వ్యవసాయ కరెంటు బిల్లులు కట్టలేదు : కేంద్ర మంత్రి ప్రతాప్‌రావు

by Hajipasha |
Electricity Bill : మా మూడు తరాలు వ్యవసాయ కరెంటు బిల్లులు కట్టలేదు : కేంద్ర మంత్రి ప్రతాప్‌రావు
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర సహాయ మంత్రి, శివసేన(షిండే) నేత ప్రతాప్‌రావు జాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు తన మూడు తరాలు ఎన్నడూ వ్యవసాయ విద్యుత్తు బిల్లులను కట్టలేదని ఆయన వెల్లడించారు.

‘‘మాది రైతు కుటుంబం. మా పొలాల్లో తాతయ్య వేయించిన పంపులు ఇంకా అలాగే ఉన్నాయి. మా తాత కానీ, నాన్న కానీ, నేను కానీ.. ఎన్నడూ వ్యవసాయ విద్యుత్ బిల్లులు అస్సలు కట్టనేలేదు’’ అని ప్రతాప్‌రావు జాధవ్ స్పష్టం చేశారు. సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ బిల్లులను మాఫీ చేసే ఓ పథకాన్ని మహారాష్ట్రలో అమలు చేస్తోంది. ఈ స్కీంకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతాప్‌రావు జాధవ్ పైవ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed