విద్యా కమిషన్ సభ్యులను నియమించిన తెలంగాణ సర్కార్

by M.Rajitha |
విద్యా కమిషన్ సభ్యులను నియమించిన తెలంగాణ సర్కార్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక ప్రకటన జారీ చేసింది. తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకే విద్యా కమిషన్ ఛైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించగా.. తాజాగా నేడు కమిషన్ సభ్యులను నియమించింది. కమిషన్ సభ్యులుగా ప్రొఫెసర్ పీ.ఎల్ విశ్వేశ్వర రావు, చారగొండ వెంకటేష్, కే. జ్యోత్స్న శివారెడ్డిలను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) విద్యపై శ్రద్దతో ప్రత్యేకంగా 'విద్యా కమిషన్' ను ఏర్పాటు చేశారు.





Advertisement

Next Story

Most Viewed