గొప్ప మనసు చాటుకున్న తెలంగాణ ఉద్యోగులు.. వరద బాధితులకు భారీ మొత్తంలో సాయం

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-03 14:54:29.0  )
గొప్ప మనసు చాటుకున్న తెలంగాణ ఉద్యోగులు.. వరద బాధితులకు భారీ మొత్తంలో సాయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సచివాలయ ఉద్యోగులు గొప్ప మనసు చాటుకున్నారు. వరద బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఆ చెక్కును సెక్రటేరియట్‌లోనే సీఎస్ శాంతి కుమారికి అందజేశారు. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గ్రామాలు నీటమునిగాయి. అనేకమంది నిరాశ్రయులు అయ్యారు. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం ప్రాంతాల ప్రజలు ముంపు బాధితులుగా మిగిలారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. సీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి సచివాలయ ఉద్యోగులు విరాళం అందించారు.

Advertisement

Next Story

Most Viewed