టార్గెట్ ఫిక్స్.. ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్సవాలకు T-టీడీపీ భారీ ప్లాన్

by Satheesh |
టార్గెట్ ఫిక్స్.. ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్సవాలకు T-టీడీపీ భారీ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలపై టీడీపీ ఫోకస్ పెట్టింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక సభలు నిర్వహిస్తుంది. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మంగళవారం ప్రకటించారు. మే 28 ఎన్టీఆర్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా ప్రపంచ వ్యాప్తంగా టీడీపీ నేతృత్వంలో100 ప్రత్యేక స‌భ‌ల‌ను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ‌లో 17 పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ఈనెల 29 నుంచి వ‌చ్చే నెల (మే) 20 వ‌ర‌కు ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి స‌భ‌ల‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాధార‌ణంగా మే మాసంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో భాగంగా మినీ మ‌హ‌నాడు స‌భ‌ల‌ను అసెంబ్లీ, జిల్లాల వారీగా టీడీపీ శ్రేణులు నిర్వహించుకోవ‌డం అన‌వాయితీగా వస్తుందన్నారు.

ఈ సంవత్సరం ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్సవాల నేప‌థ్యంలో మినీ మహానాడు స్థానంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ప్రత్యేక స‌భ‌ల‌ను నిర్వహించి ఘన నివాళులు అర్పిస్తామని తెలిపారు. ఈనెల 29న జ‌హీరాబాద్ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గంతో ఎన్టీఆర్ శ‌త జ‌యంతి సభ‌లు ప్రారంభమై.. మే 20న న‌ల్లగొండ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గంతో ముగియనున్నాయని వెల్లడించారు. ఈనెల 29న జ‌హీరాబాద్(వ‌ర్ని, బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గం), మే 3న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ (మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ టౌన్‌),4న భువ‌న‌గిరి (చౌటుప్పల్, మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం), 6న హైద‌రాబాద్ (కార్వాన్ లో), 7న ఖ‌మ్మం(ఖ‌మ్మం టౌన్‌), 8న మ‌హ‌బూబాబాద్(ములుగు), 9న సికింద్రాబాద్ (ఖైర‌తాబాద్), 10న‌ మెద‌క్(న‌ర‌సాపూర్),11న ఆదిలాబాద్(ఉట్నూరు), 12న క‌రీంన‌గ‌ర్ , 13న నాగ‌ర్ క‌ర్నూలు(కొల్లాపూర్), 14న పెద్దప‌ల్లి (మంద‌మ‌ర్రి టౌన్, చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గం), 15న చేవెళ్ల (ప‌రిగి టౌన్‌), 16న వ‌రంగ‌ల్, 17న నిజామాబాద్ (ఆర్మూరు టౌన్‌),19న మ‌ల్కాజ్‌గిరి (బాచుప‌ల్లి, కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం), 20న న‌ల్లగొండ(మిర్యాల‌గూడ టౌన్‌) లో సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులంతా భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

Next Story

Most Viewed