- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జన్వాడ ఫాంహౌస్లో అబద్ధాల ఫ్యాక్టరీ పెట్టావా.. KTRపై T-కాంగ్రెస్ సంచలన ట్వీట్
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై టీ-కాంగ్రెస్ ఫైర్ అయింది. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి నోటీసులు అందకున్న తనకు నోటీసులు వచ్చినట్లు ముఖ్యమంత్రి చెబుతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చింది. కేటీఆర్ కు అధికారం పోయినా తలపొగరు తగ్గలేదని.. జన్వాడ ఫాం హౌస్ లో అబద్ధాల ఫ్యాక్టరీ ఏమైనా పెట్టినవా? లేక మతి పోయిందా? అని ప్రశ్నించింది. స్వయంగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లోని గాంధీ భవన్ కి వచ్చి పార్టీ అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల తరఫున ప్రశ్నిస్తుంటే తెలంగాణ అంతా ఏకమై మద్దతు తెలుపుతుంటే. బీఆర్ఎస్ నాయకులు అడ్డదారిన అధికారం పొందడం కోసం బీజేపీతో జత కట్టి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని ఫైర్ అయింది. భారత దేశ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనే బీజేపీ చెంతన చేరి దేశ ద్రోహం చేస్తున్నారని మండిపడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసైనా బుద్ధి మార్చుకుంటే మీ పార్టీకి మనుగడ ఉండేది. ఇలాంటి చిల్లర ఆరోపణలు, అబద్ధాలు చెబితే తెలంగాణ మిమ్మల్ని క్షమించదు.. లోక్ సభ ఎన్నికల తర్వాత కారును బీజేపీకి తూకానికి అమ్ముకోవాల్సిందే.. అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్కు ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డి పేరిట అందించిన నోటీసుల కాపీని జత చేసింది.