BREAKING: కేటీఆర్‌పై దాడి కేసు.. 26 మంది హనుమాన్ దీక్షదారులు అరెస్ట్..!

by Disha Web Desk 19 |
BREAKING: కేటీఆర్‌పై దాడి కేసు.. 26 మంది హనుమాన్ దీక్షదారులు అరెస్ట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గురువారం రాత్రి ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోని భైంసాలో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతుండగా కొందరు కేటీఆర్‌పై టమాటాలు, ఉల్లిగడ్డలతో దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేటీఆర్‌పై దాడి చేసిన 26 మంది హనుమాన్ దీక్షదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీడియో ఫుటేజీ ద్వారా విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

హనుమాన్ దీక్షదారులను అరెస్ట్ చేయడంతో బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘాల నేతలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో మరోసారి భైంసాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా, గతంలో రాముడిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాత్రి భైంసాలో మాజీ మంత్రి రోడ్ షోను హనుమాన్ దీక్ష దారులు అడ్డుకున్నారు. కేటీఆర్ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కొందరు కేటీఆర్‌పై టమాటాలు, ఉల్లిగడ్డలతో దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed