పార్టీ ఫిరాయింపులపై కోర్టు తీర్పు.. స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్

by Mahesh |
పార్టీ ఫిరాయింపులపై కోర్టు తీర్పు.. స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్
X

దిశ, వెబ్ డెస్క్: 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీలు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఒకవేళ చర్యలు తీసుకోకుంటే సుమోటోగా తీసుకుంటాని కోర్టు తెలిపింది. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. పార్టీ ఫిరాయింపుల కేసు కోర్టు పరిధిలో ఉందని.. పార్టీ మారిన వారిపై చర్యలకు కోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చిందన్నారు. అలాగే తాము నిబంధనల ప్రకారం నడుచుకుంటామని.. తాను తీసుకునే నిర్ణయం రాబోయే కాలంలో తెలుస్తుందని చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది. కాగా స్పీకర్ తీసుకునే నిర్ణయంపై పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు ఆయన అనుచరులలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.

Advertisement

Next Story
null