టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 110 మంది గుర్తింపు: గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్‌

by Mahesh |
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 110 మంది గుర్తింపు: గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్‌
X

దిశ, వెబ్‌డెస్క్: గత ప్రభుత్వ హయాంలో టీడీపీ పార్టీ కార్యాలయంపై పలువురు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన విచారణ కోర్టులో కొనసాగుతుండగా.. పోలీసులు.. దాడి చేసిన వారిని గుర్తిచే పనిలో పడ్డారు. ఈ క్రమంలో.. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 110 మంది గుర్తించినట్లు గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. అలాగే మరికొంతమంది తమను అరెస్ట్ చేయోద్దంటూ ముందస్తుగానే కోర్టుకు వెళ్లారని.. అరెస్ట్ నుంచి మినహాయింపు పొందిన వారిని.. త్వరలోనే విచారణకు పిలిస్తామన్నారు. అలాగే ఇటీవల జరిపిన విచారణలో బాపట్ల ఎంపీ.. నందిగం సురేష్ సహకరించారన్నారు. అలాగే ఆయన తమ విచారణలో చెప్పిన సమాధానాలను క్రాస్ చెక్ చేసుకుంటాని.. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై.. శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని.. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed