Nitin Gadkari : కేంద్రమంత్రి నితీన్‌గడ్కరీని కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌

by Y. Venkata Narasimha Reddy |
Nitin Gadkari : కేంద్రమంత్రి నితీన్‌గడ్కరీని కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కేంద్రమంత్రి నితీన్‌గడ్కరీతో భేటీ అయ్యారు. వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు జాతీయ రహదారుల పనులపై ఆయన గడ్కరీతో చర్చలు జరిపారు. స్పీకర్‌తో పాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ లు కూడా కేంద్ర మంత్రిని కలిశారు. వికారాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారుల పనులను సత్వరమే పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిధుల విడుదల చేయాలని వారు గడ్కరీని కోరారు. ఇందుకు సంబంధించిన వినతి పత్రాలను అందించారు.

Next Story

Most Viewed