నీట్ పేపర్ లీక్‌లో 14 మంది కేంద్ర మంత్రుల హస్తం: శివసేనా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
నీట్ పేపర్ లీక్‌లో 14 మంది కేంద్ర మంత్రుల హస్తం: శివసేనా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నీట్ పేపర్ లీక్‌లో 14 మంది కేంద్ర మంత్రుల ప్రమేయం ఉన్నదని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వాళ్ల పిల్లల భవిష్యత్ కోసమే ఇలాంటి దారుణానికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. నీట్ పరీక్ష పత్రం లికేజ్ చేసిన నిందితులను విచారిస్తే బీజేపీ నేతల బండారం బయటపడుతుందన్నారు. అసలు నిజాలు బయటపడితే, కేంద్ర ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు. అందుకే నీట్ పరీక్ష రద్దు చేసేందుకు కేంద్రం వెనకాడుతుందన్నారు. 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడుతుందన్నారు. న్యాయం చేయకపోతే పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed