మోడీ 3.0లో సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఇళ్ల నిర్మాణంపై కీ డెసిషన్!

by Rajesh |   ( Updated:2024-06-10 05:58:15.0  )
మోడీ 3.0లో సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఇళ్ల నిర్మాణంపై కీ డెసిషన్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ ప్రధానిగా మోడీ మూడోసారి ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 72 మందితో కేంద్ర కేబినెట్ కొలువుదీరింది. అయితే నేడు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న మోడీ అధికారిక నివాసంలో కేబినెట్ భేటీ కానుంది. తొలి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది. పీఎం ఆవాస్ యోజన కింద అదనంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉభయసభలను ఉద్దేశించి నేడు ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ నెల 20వ తేదీన లోక్ సభ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. కాగా, మోడీ ప్రధానిగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ కావడంతో తీసుకునే కీలక నిర్ణయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed