- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
మోడీ 3.0లో సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఇళ్ల నిర్మాణంపై కీ డెసిషన్!
X
దిశ, వెబ్డెస్క్: భారతదేశ ప్రధానిగా మోడీ మూడోసారి ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 72 మందితో కేంద్ర కేబినెట్ కొలువుదీరింది. అయితే నేడు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్లో ఉన్న మోడీ అధికారిక నివాసంలో కేబినెట్ భేటీ కానుంది. తొలి కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది. పీఎం ఆవాస్ యోజన కింద అదనంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉభయసభలను ఉద్దేశించి నేడు ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ నెల 20వ తేదీన లోక్ సభ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. కాగా, మోడీ ప్రధానిగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ కావడంతో తీసుకునే కీలక నిర్ణయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Advertisement
Next Story