Seethakka : ఆదివాసీ కాబట్టే నాపై ఆరోపణలు.. సీతక్క ఎమోషనల్ కామెంట్స్

by Rajesh |
Seethakka : ఆదివాసీ కాబట్టే నాపై ఆరోపణలు.. సీతక్క ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదివాసీ కాబట్టే తనపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం మీడియాతో సీతక్క మాట్లాడారు. పోడు భూముల చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్సే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్‌తో అనేక మంది గిరిజనులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. మైనార్టీలకు బీఆర్ఎస్ రిజర్వేషన్లు ఇవ్వలేదన్నారు. మైనార్టీలకు తాము బడ్జెట్‌లో నిధులు కేటాయించామన్నారు. పోడు వ్యవసాయం యాక్ట్‌కు అర్హులు కాబట్టే.. తన తల్లిదండ్రులకు పట్టా వచ్చిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed