కార్గిల్ యుద్ధంలో భారత సైనికుల త్యాగం చిరస్మరణీయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Satheesh |
కార్గిల్ యుద్ధంలో భారత సైనికుల త్యాగం చిరస్మరణీయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కార్గిల్ విజయ్ దివాస్ (జూలై 26) సందర్భంగా యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు ఆర్పించిన అమర జవాన్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్గిల్ యుద్ధాన్ని భారత్ గెలిచి నేటికి పాతికేళ్లని గుర్తు చేశారు. ఈ యుద్ధంలో మన సైనికుల త్యాగం చిరస్మరణీయం అని కొనియాడారు. కశ్మీర్‌ను ఆక్రమించుకోవాలనే పాక్ దుర్భుద్ధికి భారత సైనికులు గట్టి సమాధానం ఇచ్చారని అన్నారు. భారత సైనిక వ్యవస్థ బలోపేతానికి ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. దేశ రక్షణగా నిలిచే సైనికుల క్షేమం కోసం ప్రభుత్వం ఏ విషయంలో వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే సైనిక రంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు.



Next Story