- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
రాథోడ్ రమేష్ సేవలు మరువలేనివి!.. మాజీ ఎంపీ మృతిపై బండి సంజయ్ సంతాపం
by Ramesh Goud |
![రాథోడ్ రమేష్ సేవలు మరువలేనివి!.. మాజీ ఎంపీ మృతిపై బండి సంజయ్ సంతాపం రాథోడ్ రమేష్ సేవలు మరువలేనివి!.. మాజీ ఎంపీ మృతిపై బండి సంజయ్ సంతాపం](https://www.dishadaily.com/h-upload/2024/06/29/347307-rathodebandi.webp)
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాథోడ్ రమేష్ గారి మరణ వార్త కలచివేసిందని, వారి సేవలు మరుపలేనివి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ మృతిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన తన సంతాపం తెలియజేశారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపి నేత రాథోడ్ రమేష్ గారు అనారోగ్యంతో మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఆదిలాబాద్ ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా వారు అందించిన సేవలు మరువలేనివని, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం వారు చేసిన కృషి అసామాన్యమని కొనియాడారు. రమేష్ రాథోడ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు, అభిమానులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని బండి సంజయ్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
Next Story