ట్రాక్టర్ ను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు..

by Sumithra |
ట్రాక్టర్ ను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు..
X

దిశ, కేశంపేట : రైతు వ్యవసాయ పొలం వద్ద ఉంచిన ట్రాక్టర్ ను, ట్రాలీని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన సంఘటన కేశంపేట మండల పరిధిలోని నిర్దవెల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండ బాలయ్య అనే రైతు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజు మాదిరిగా తన ట్రాక్టర్ తో వ్యవసాయ పనులు చేశాడు.

అనంతరం యధావిధిగా తన వ్యవసాయ పొలం వద్ద ట్రాక్టర్ ను వదిలి ఇంటికి వచ్చాడు. ఉదయం వెళ్లి చూసేసరికి పొలం వద్ద ట్రాక్టర్ లేకపోవడంతో దిగ్భ్రాంతి చెందాడు. చుట్టుప్రక్కల రైతులను అడిగిన ఆచూకీ తెలియరాలేదు. మహేంద్ర కంపెనీకి చెందిన ట్రాక్టర్ 2014 సంవత్సరానికి చెందిన 575 మోడల్, ట్రాలీ అని రైతు తెలిపాడు. ట్రాక్టర్ ఆచూకీ తెలిసినవారు తన సెల్ నం.7013 188 242 కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రైతు వివరించాడు.

Advertisement

Next Story