- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ప్రజా ప్రతినిధుల సేవలు మరువలేనివి : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
![ప్రజా ప్రతినిధుల సేవలు మరువలేనివి : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రజా ప్రతినిధుల సేవలు మరువలేనివి : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348282-22.webp)
దిశ,ఆమనగల్లు: గ్రామాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల సేవలు మరువలేనివని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మాడుగుల మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ పద్మ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ద్వారా ఎన్నుకోబడిన స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారని అన్నారు.
వివిధ గ్రామాల్లో విద్యుత్ సమస్య నెలకొందని,వివిధ గ్రామాల తండాల్లో బిటి రోడ్డు నిర్మించాలని ఎంపీటీసీ బట్టు కిషన్ రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పదవి కాలం వస్తున్న ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజా సేవలో ఉంటూ ప్రజల నుండి గుర్తింపు పొందాలని సూచించారు.అనంతరం ఎంపీటీసీలను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ పద్మ రెడ్డి, ఎంపీటీసీలు బట్టు కిషన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, పాండు గౌడ్, నారమ్మ, చంటి, కో ఆప్షన్ సభ్యులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు