Delhi: ఏపీ అభివృద్ధిపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

by srinivas |
Delhi: ఏపీ అభివృద్ధిపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కేంద్రహోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన్ను చంద్రబాబు కలిశారు. ఈ నేపథ్యంలో అమిత్ షా మాట్లాడుతూ వికసిత్ ఏపీ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిపై సీఎం చంద్రబాబు, టీడీపీ ఎంపీలతో చర్చించామని కేంద్రహోంమంత్రి అమిత్ షా తెలిపారు.


కాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశ రాజధానిలో ప్రధాని మోడీతో పాటు కేంద్రహోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఏపీ విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు, వెనకబడిన జిల్లాలకు నిధులపై చర్చించారు. అలాగే లోటు బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి ఆర్థిక అందించాలని కేంద్రమంత్రులను చంద్రబాబు కోరారు.

Next Story

Most Viewed