ప్రభుత్వ ఆసుపత్రి స్లాబ్ నుంచి వర్షపు నీరు లీకేజీ

by Kalyani |
ప్రభుత్వ ఆసుపత్రి స్లాబ్ నుంచి వర్షపు నీరు లీకేజీ
X

దిశ, మర్పల్లి: ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ వార్డుకు వెళ్లే దారి లో స్లాబ్ నుంచి వర్షపు నీరు లీకేజీ కావడంతో దారి చిత్తడిగా మారింది. వైద్యం కోసం వచ్చిన రోగులు సెలైన్, అడ్మిషన్ అవడానికి ఈ దారి గుండా వెళ్లాల్సి ఉంది. దీంతో రోగులు చిత్తడిగా మారిన దారి గుండా రాకపోకలు సాగిస్తున్నారు. ఎవరైనా నడిచే టప్పుడు కాలు జారి పడే ప్రమాదం ఉందని రోగులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం వందలాది మంది రోగులు వైద్యం నిమిత్తం ఆసుపత్రికి వస్తుంటారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి స్లాబ్ నుంచి వచ్చే నీరును రాకుండా చర్యలు తీసుకోవాలని రోగులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story