మోడీ దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్నారు : కొండా సంగీతా రెడ్డి

by Disha Web Desk 23 |
మోడీ దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్నారు : కొండా సంగీతా రెడ్డి
X

దిశ,మహేశ్వరం: దేశంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రధాని నరేంద్ర మోడీ నిలిచిపోయారని చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి సంగీతా రెడ్డి అన్నారు.శుక్రవారం మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ తండా,హర్షగూడ గ్రామంలో లంబాడి మహిళల వేషధారణలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొండా సంగీతా రెడ్డి మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్నారన్నారు.మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని పిలుపునిచ్చారు.నరేంద్ర మోడీ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని ప్రజా నాయకులన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో చేవెళ్లను పార్లమెంట్ నియోజకవర్గం ను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. మే13 న ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed