- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం రేవంత్ కు కానుక ఇద్దాం : మాజీ ఎమ్మెల్యే
దిశ, మీర్ పేట్ : చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి కానుక ఇద్దామని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి అన్నారు. ఆదివారం కార్పొరేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ ఫేస్ 1 మురళి కృష్ణా నగర్ ,భాగ్య కళానగర్ లో మాజీ ఎంపీటీసీ డేరంగుల యాదయ్య ఆధ్వర్యంలో రంజిత్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి సీతా రంజిత్ రెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షకులు నేరెళ్ల శారద లు ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కోరారు. 6 గ్యారంటీ అమల్లో భాగంగా ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రికి బలం చేకూర్చాలని తీగల కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, పలువురు కార్పొరేటర్లు, ,కార్యకర్తలు పాల్గొన్నారు.