చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

by Aamani |
చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు :  ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
X

దిశ, ఆమనగల్లు: చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.బుధవారం ఎమ్మెల్యే ఆమనగల్లు మండలంలో పర్యటించారు. ఇటీవల భారీ వర్షాలకు ఇండ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం తరఫున తహసీల్దార్ లలిత తో కలిసి చెక్కులను అందజేశారు. అనంతరం నిండుకుండలా కనిపిస్తున్న సురసముద్రంను పరిశీలించి, చెరువు కట్టపై నిర్వహించే గణేష్ నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పట్టణ కేంద్రంలోని భక్త మార్కండేయ యువజన సంఘం గణేష్ విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మండలంలోని మేడిగడ్డ, శంకర్ కొండ మధ్య నిర్మిస్తున్న కత్వ వాగు నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఏఈ అభిషేక్ తో కలిసి పరిశీలించారు. గిరిజనుల రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తహసీల్దార్ లలిత, పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు జగన్, నాయకులు అప్పం శ్రీనివాసులు, అవ్వారి శివలింగం, గాజుల శ్రీను, ఎంగలి రమేష్, మామిడిశెట్టి రవి,ఒగ్గు మహేష్,విజయ్ రాథోడ్, మెకానిక్ బాబా, మహేష్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed