కాంగ్రెస్ తోనే రైతు సంక్షేమానికి పెద్దపీట : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ తోనే రైతు సంక్షేమానికి పెద్దపీట :  ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
X

దిశ, పెద్దేముల్: కాంగ్రెస్​ పార్టీతోనే ఈ దేశానికి… రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని… బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్దపు వాగ్దానాలు ఇస్తున్నారని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరూ కూడా ఆ పార్టీల మాటలు నమ్మి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు మోసపోవద్దని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండలంలోని తిమసాన్ పల్లి, గ్రామంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి కి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అభివృద్ది, సంక్షేమ పథకాలకు రైతులకు పెద్దపీట వేస్తుందన్నారు.

బిజేపి పార్టీకి ఓటు వేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు పోతాయన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని తెచ్చి పేదల ఖాతాలో 15 లక్షలు వేస్తామని మోసం చేశారన్నారు. పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 3,500 ఇండ్లను కట్టిస్తామన్నారు. డ్వాక్రా సంఘాలకు 10 లక్షలు వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ పరిశ్రమలు వచ్చాయన్నారు.

ఆరు గ్యారంటీలను పక్క అమలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ డీసీసీబీ చైర్మన్ లక్మారెడ్డి, తాడేపల్లి సొసైటీ డైరెక్టర్ మల్లేశం, ఏ బ్లాక్ అధ్యక్షుడు లోంక నర్సింలు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు డీవై నర్సింలు, కొమ్ము గోపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఎల్లారెడ్డి, హనీఫ్, రవి, భీమప్ప, సంజీవ్, తదితరులు పాల్గోన్నారు..

Next Story

Most Viewed