రంజిత్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి

by Disha Web Desk 11 |
రంజిత్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి
X

దిశ, మీర్ పేట్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహ రెడ్డి పిలుపునిచ్చారు. కార్పొరేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో గురువారం బూత్ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి,మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ..ప్రజలు దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ దోపిడి పాల తో విసిగిపోయారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ, మహిళల కు రూ.500 కే గ్యాస్ కనెక్షన్ ,ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు మహాలక్ష్మి, రైతు భరోసా, ప్రతి కుటుంబానికి 200 ఉచిత విద్యుత్ హామీలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 5న తుక్కుగూడ లో జరిగిన తెలంగాణ జన జాతర సభలో మేనిఫెస్టో విడుదల చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. సమావేశాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు దేపా భాస్కర్ రెడ్డి , పీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మహేశ్వరం ఇంచార్జి శారదా,మీర్ పేట్ ఇంచార్జి బంగారు సత్యనారాయణ , మాజీ జెడ్పిటిసి నరేందర్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ కవిత బాల్ రెడ్డి , కార్పొరేటర్ మౌనిక శ్రీశైలం , కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ మాజీ డైరెక్టర్ ఎరుకల వెంకటేష్ గౌడ్ , మాజీ ఎంపీటీసీ నిమ్మల వెంకటేష్ గౌడ్ ,యాదిరెడ్డి మాజీ ఎంపీటీసీ సిద్దాల దశరథ్,పల్లె పాండు గౌడ్,మీర్ పేట్ మహిళా అధ్యక్షురాలు పద్మ, మహిళ నాయకురాలు గంగమ్మ, శేఖర్ రెడ్డి, విజయ రెడ్డి,సురేందర్ రెడ్డి, మురులేష్ గౌడ్, సుభాష్ రెడ్డి, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

Next Story