ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్... కాంగ్రెస్‌లో చేరిన కౌన్సిలర్, 300 మంది కార్యకర్తలు

by Disha Web Desk 1 |
ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్... కాంగ్రెస్‌లో చేరిన కౌన్సిలర్, 300 మంది కార్యకర్తలు
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్: పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కౌన్సిలర్ వడ్డేపల్లి విద్య విజయేందర్ రెడ్డి‌తో పాటు బ్యాంకు డైరెక్టర్ ఇటిక్యాల మహేందర్ రెడ్డి, మాజీ కో-ఆప్షన్ మెంబర్ సత్తార్ సహా సుమారు 300 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ బుధవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ విద్యావతి మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ కొత్తపల్లి జైపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చెవుల స్వప్న చిరంజీవి, కౌన్సిలర్లు సిద్దెంకి కృష్ణారెడ్డి, రాజేందర్, పండుగల జయశ్రీ రాజు, గ్యారాల శ్రీనివాస్ గౌడ్, అనుపమ సుప్రసేనా‌రెడ్డి, హరిశంకర్, సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ గంట శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు దండెం రాజశేఖర్ రెడ్డి, మరియాల రాజు, అయ్యప్పరెడ్డి, గంట సుదర్శన్ రెడ్డి, మజ్జిగ లక్ష్మారెడ్డి, నర్సింగ్, సంతోష్ గౌడ్, మల్లెబోయిన రాజు, యంజాల సంజీవ, మల్కన్న, నాగరాజు, మల్లేష్, వివిధ కాలనీల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed