కోడల్ని చంపిన అత్త, మామకు రిమాండ్

by Kalyani |
కోడల్ని చంపిన అత్త, మామకు రిమాండ్
X

దిశ, రాజేంద్రనగర్ : కోడలిని చంపిన అత్త, మామను అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. శనివారం కేసు వివరాలను ఇన్స్పెక్టర్ వెంకటరామిరెడ్డి వెల్లడించారు. హసన్ నగర్ కు చెందిన ఫర్జానా బేగం, మహమ్మద్ నూర్ దంపతుల పెద్దకొడుకు అయిన మహమ్మద్ ఆబ్బాస్ కు కొన్నేళ్ల క్రితం అజ్మెరి బేగం (28) తో వివాహం జరిపించారు. కొంతకాలం వరకు పని మనిషిగా పనిచేసిన అజ్మెరి బేగం అనంతరం పని మానేసింది. పని చేయకుండా ఖాళీగా ఉన్నావని ఆమెను కుటుంబ సభ్యులు వేధించసాగారు. దీంతో ఆమె కొంతకాలం తన పుట్టింటికి వెళ్ళి అక్కడే ఉంది. తర్వాత ఆమె మహిళా మండలి లో ఫిర్యాదు చేయగా అప్పట్లో పెద్ద మనుషుల పంచాయితీ పెట్టారు. ఇకపై బాగా చూసుకుంటానని అబ్బాస్, ఆయన తల్లితండ్రులు చెప్పగా అజ్మెరి బేగమ్ తన పిల్లలతో సహా అత్తగారింటికి వచ్చింది.

తర్వాత కూడా వారి వేధింపులు కొనసాగినాయి. ఈ క్రమంలో బక్రీద్ సందర్భంగా ఆమె పిల్లలను తీసుకుని మళ్ళీ పుట్టింటికి వెళ్ళి అక్కడే ఉంది. భర్త బ్రతిమాలడముతో ఈనెల 26న మధ్యాహ్నం తిరిగి పిల్లలతో ఇంటికి వచ్చింది. మరుసటి రోజు అబ్బాస్ ఆటో తీసుకుని బయటికి వెళ్ళగా అజ్మెరి బేగమ్ పిల్లలను స్కూల్ కి పంపి ఇంట్లో పని చేసుకుంటుండగా ఆమె అత్త ఫర్జానా బేగం తనకు చాయ్ పెట్టమని కోడల్ని కోరింది. ఆమె పెట్టలేదనే కోపముతో ఫర్జానా గొడవ పడి తన భర్త నూర్ తో కలిసి చున్నితో కొడలి గొంతుకు బిగించి చంపారు. మృతురాలి తల్లి చోటి బీ ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ . వెంకట రామి రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.

Next Story

Most Viewed