- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
బీఆర్ఎస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా కేసీఆర్, కేటీఆర్, కవిత ఫోన్లు ట్యాప్ చేస్తున్నరని ఆరోపించిన కౌశిక్ రెడ్డి.. తన పర్సనల్ విషయాలు కూడా లీక్ అవుతున్నాయని, గురువారం జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావుతో కలిసి ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభుత్వం సీబీఐ విచారణ జరపాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాజకీయ నేతలతో పాటు పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తేలిన కేసులో నేటికి విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.