మరోసారి ఢిల్లీకి CM రేవంత్ రెడ్డి

by Gantepaka Srikanth |
మరోసారి ఢిల్లీకి CM రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) మరోసారి ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి బేగంపేట విమానాశ్రయం(Begumpet Airport) నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లనున్నారు. పలువురు పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీపై చర్చించనున్నారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీలో టీపీసీసీ కార్యవర్గంపైనా చర్చించనున్నారు. అంతేకాదు.. ఇటీవల అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు. ఇదిలా ఉండగా.. మంత్రివర్గ విస్తరణలో ఈసారి ఎవరికి అవకాశం దక్కుతుందో అని నేతల్లో ఉత్కంఠ నెలకొంది. దసరాలోపు మంత్రి వర్గాన్ని చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారట.

Advertisement

Next Story

Most Viewed