- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
జాగ్రత్త.. డమ్మీ తుపాకులు పట్టుకొని రీల్స్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతోన్న యువకులు
దిశ, వెబ్డెస్క్: రోజురోజుకు దొంగలు చెలరేగిపోతున్నారు. రాత్రి పగలు అని తేడా లేకుండా.. ఇంటికి తాళం దొరికితే చాలు చేతికి ఏం కనిపిస్తే అవి దోచుకుని వెళ్తున్నారు. ఇంటి యజమానులు డబ్బు, బంగారం ఎంత భద్రంగా ఏ మూలన దాచిపెట్టిన చిటికలో వెతికి మరీ మాయమవుతున్నారు. దొంగలపై పోలీసులు నిఘా పెట్టి.. చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ దొంగలకు భయం లేకుండా పోయింది. తాజాగా ముగ్గురు యువకులు డమ్మీ తుపాకులు పట్టుకొని రీల్స్ చేస్తూ దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు డమ్మీ తుపాకులు పట్టుకుని రీల్స్ చేస్తూ.. రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులపై, ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులను బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్నరు. గత కొద్దిరోజులుగా నడుస్తోన్న ఈ దొంగల వ్యవహారం గురించి పోలీసులకు సమాచారం అందించగా.. ముగ్గురు యువకులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.