మాటమాట పెరిగి.. కత్తులతో దాడి

by Sridhar Babu |   ( Updated:2023-12-02 15:17:32.0  )
మాటమాట పెరిగి.. కత్తులతో దాడి
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అఖిల్, ఆసిఫ్ అనే ఇరువురి మధ్య వ్యాపార లావాదేవీల్లో జరిగిన గొడవల్లో మాట మాట పెరిగి కత్తిపోట్లకు దారితీసింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో నిజామాబాద్ ఎక్స్ రోడ్ లో వీరు హేయిర్ సెలూన్ ను నిర్వహిస్తున్నారు. వ్యాపార లావాదేవీల్లో జరిగిన గొడవతో మాటా మాటా పెరిగింది. దాంతో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరికీ గాయాలు కావడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆర్మూర్ పోలీసులు సమాచారం తెలుసుకొని సంఘటన స్థలాన్ని సందర్శించి కేసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed