మాచవరం దగ్గర కుంగిన రైల్వే ట్రాక్.. పలు రైళ్ల నిలిపివేత

by M.Rajitha |
మాచవరం దగ్గర కుంగిన రైల్వే ట్రాక్.. పలు రైళ్ల నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లాలోని మాచవరం వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది. నిన్నటి నుండి ఏపీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ట్రాక్ కుంగినట్టు రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా ట్రాక్ కుంగిపోవడంతో విజయవాడ - చెన్నై మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుపతి - సికింద్రాబాద్ వందే భారత్ రైలు కూడా నిలిచిపోయింది. వెంటనే స్పందించిన అధికారులు వందే భారత్ రైలును వెనక్కి మళ్లించి అప్పికట్ల స్టేషన్ నుండి మూడో లైన్ ద్వారా నడిపించారు. కుంగిపోయిన ట్రాక్ వద్ద జోరు వర్షంలో కూడా శరవేగంగా మరమ్మత్తుల పనులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed