న్యూజిలాండ్‌ చేతిలో పాక్ చిత్తు.. వరల్డ్ కప్ నుంచి టీమిండియా ఔట్

by Gantepaka Srikanth |
న్యూజిలాండ్‌ చేతిలో పాక్ చిత్తు.. వరల్డ్ కప్ నుంచి టీమిండియా ఔట్
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్(Pakistan) ప్లేయర్లు చేతులెత్తేశారు. దీంతో వరల్డ్ కప్(World Cup) నుంచి టీమిండియా(Team India) ఇంటిబాట పట్టింది. సోమవారం దుబాయ్‌(Dubai)లోని అంతర్జాతీయ మైదానం వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది. 111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఆదిలోనే చతికిలబడింది. న్యూజిలాండ్(New Zealand) చేతిలో 54 రన్స్ తేడాతో ఘోర పరాజయం పాలైంది. దీంతో భారత్, పాక్ రెండు జట్ల సెమీస్ ఆశలు గల్లంతు అయ్యాయి. కాగా, గ్రూపు-ఏ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరింది. తాజాగా.. పాక్‌పై గెలుపుతో న్యూజిలాండ్ సైతం బెర్త్ ఖరారు చేసుకుంది.

Next Story

Most Viewed