క్రిస్మస్ వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్

by Sumithra |
క్రిస్మస్ వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాదు నగరంలోని సీఎస్ఐ చర్చిలో అర్బన్ శాసనసభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ పాల్గొని క్రిస్టియన్ సోదర, సోదరిమనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలను, అన్ని మతాలను సమానంగా చూస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కరోనా సమయంలో అన్నివర్గాల ప్రజలకు ఉచిత వాక్సిన్ ఇచ్చారని తెలిపారు.

దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టె పథకంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని చెప్పారు. జన్ ధన్ పథకం నుంచి మొదలు పెడితే ఆయుష్మాన్ భారత్ పథకం వరకు ప్రతి పథకం అన్ని వర్గాల ప్రజలకు అందుతుందన్నారు. ఎటువంటి సహాయ సహకారం అవసరం ఉన్నా అందరికీ అండగా ఉంటాను అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ న్యాలం రాజు, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, జన్స్, జోసెఫ్, డేవిడ్, పాల్గొన్నారు.

Advertisement

Next Story