బాసర సరస్వతి ఆలయంలో సినిమా ప్రముఖుల సందడి

by Sridhar Babu |

దిశ, భైంసా : నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆదివారం తెలుగు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. నిర్మాత దిల్ రాజు, సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దిల్ రాజు కుటుంబ సభ్యులు వేదభారతి పీఠం సందర్శించారు. ఈ సందర్భంగా వైదిక బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదభారతి పీఠం వ్యవస్థాపకులు వేద విద్యానంద స్వామీజీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే తనికెళ్ల భరణి మనువడు సర్వజ్ఞ కు అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ మర్యాదాలతో దేవస్థాన అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Next Story