శాసనమండలి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన మధుసూదనాచారి

by M.Rajitha |
శాసనమండలి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన మధుసూదనాచారి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ శానమండలిలో ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేడు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మధుసూదనాచారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. శాసనమండలి ప్రతిపక్షనేతగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకి అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని అన్నారు. ఈ అవకాశం కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మధుసూదనాచారిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబులు కలసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story