బోధన్‌లో దొంగల బీభత్సం.. సుమారు 10 తులాల బంగారం చోరీ

by Anjali |
బోధన్‌లో దొంగల బీభత్సం.. సుమారు 10 తులాల బంగారం చోరీ
X

దిశ, బోధన్: బోధన్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లి ప్రాంతానికి చెందిన చౌడా రెడ్డి ఇంట్లో బుధవారం అర్ధరాత్రి తరువాత ఇంట్లోకి దూరి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న బోధన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాధితుని ఇంటి బయట ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దొంగలను త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. దొంగలను పట్టుకున్నాక మీడియాకు పూర్తి వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దొంగల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. బస్ స్టేషన్‌లో, రైల్వే స్టేషన్‌లో, రోడ్డుపై ప్రయాణిస్తోన్న క్రమంలో, ఇళ్లల్లో చొరబడుతూ మమ్మల్ని ఏం చేస్తారులే అనుకుంటూ తెగ రెచ్చిపోతున్నారు. దర్జాగా చోరీలకు పాల్పడుతున్నారు.

Next Story

Most Viewed