భర్త మోసం చేశాడని భార్య ఆందోళన

by Kalyani |
భర్త మోసం చేశాడని భార్య ఆందోళన
X

దిశ, నిజామాబాద్ సిటీ : కట్టుకున్న భర్త తనను మోసం చేశారంటూ భార్య ఆందోళనకు దిగింది. మహిళా సంఘాలతో కలిసి సదరు బాధితురాలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోట గల్లి ప్రాంతానికి చెందిన సిరిపురం మనిష్విని 2016 మార్చి నెలలో సిరిపురం శ్రీనివాస్ అనే వ్యక్తితో పెళ్లి చేసుకుంది. అయితే తమ వివాహం అనంతరం అత్తగారు తన ఇంటిని బహుమతి ద్వారా తనకు ఇవ్వడం జరిగిందని మనిష్విని పేర్కొంది. అయితే ఇక్కడే తమకు సమస్య ఎదురైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఇంట్లో గత కొన్ని సంవత్సరాలుగా తాను నివాసం ఉంటున్నట్లు తెలిపింది.

తన భర్త శ్రీనివాస్ మొదటి భార్య అయిన సవిత ఎలాగైనా తన అత్తగారు తనకు ఇచ్చిన ఇంటిని స్వాధీనం పరుచుకునేందుకు తన భర్త శ్రీనివాస్ తో కలిసి బెదిరింపులకు దాడులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనకు జరిగిన అన్యాయానికి సవిత నివాసం ఉండే బొంబాయికి వెళ్లి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె అన్నారు. దీన్ని సుమోటో గా స్వీకరించి జిల్లా కోర్టు, అలాగే 4వ టౌన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. సవిత ఆమె అనుచరులు గత శనివారం మధ్యాహ్నం తన ఇంటిపై దాడి చేసి నాపై, ఆ బంధువులపై అకారణంగా దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణం తెరవెనుక తన భర్త శ్రీనివాస్ కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. విషయాన్ని తెలుసుకున్న ఆశాజ్యోతి మహిళా సంఘం అధ్యక్షురాలు ఏకే లత కొంతమంది మహిళలు కలిసి మంగళవారం ఆందోళన చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed