పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు

by Sridhar Babu |
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు
X

దిశ, నిజామాబాద్ క్రైం : వ్యవసాయ క్షేత్రాలను అడ్డుగా చేసుకుని పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీస్ లు దాడులు నిర్వహించారు. బుధవారం నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో సీఐ అంజయ్య ,టాస్క్ఫోర్స్ సిబ్బంది రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి క్యాంప్ లో పేకాట స్థావరం పై దాడి చేశారు. అక్కడ జూదం ఆడుతున్న 14 మంది పేకాట రాయుళ్లను పట్టుకుని వారివద్ధ నుంచి రూ. 27,230 సీజ్ చేశారు. వారివద్ధ నుంచి 13 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని రూరల్ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story