ట్రాన్స్కో ఇంటర్ టోర్నమెంట్ క్రీడలు ప్రారంభం

by Sridhar Babu |
ట్రాన్స్కో ఇంటర్ టోర్నమెంట్ క్రీడలు ప్రారంభం
X

దిశ, నిజామాబాద్ సిటీ : ప్రతినిత్యం ఉద్యోగరీత్యా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు క్రీడలు ఎంతో మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ట్రాన్స్కో సీఎం డి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్ లో జరిగిన రాష్ట్రస్థాయి ట్రాన్స్కో ఇంటర్ సర్కిల్ టోర్నమెంట్ ఫుట్బాల్, టగ్ ఆఫర్, అథ్లెటిక్స్ క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, ప్రతి రోజూ వ్యాయామం చేసి మానసికంగా దృఢంగా ఉండాలని కోరారు. పని ఒత్తిడిని కూడా తొలగించుకోవాలన్నారు. కార్యక్రమంలో సభాధ్యక్షులు ఎస్ఈ ఆపరేషన్ నిజామాబాద్ రవీందర్, క్రీడా అధికారి జగన్నాథ్, రమేష్ బాబు, కామారెడ్డి ఎస్ ఈ సూర్య నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed